యువకుడి దారుణహత్య

పెట్రోల్‌ పోసి నిప్పు
రంగారెడ్డి,మే7(జ‌నం సాక్షి):  జిల్లాలో ఓ వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఆదిభట్ల పీఎస్‌ పరిధిలోని పటేల్‌గూడ సవిూపంలో ఆరుట్ల గ్రామానికి చెందిన రమేష్‌(26) అనే యువకుడు హత్యకు గురయ్యాడు. రమేష్‌ను బండరాళ్లతో కొట్టి చంపిన దుండగులు పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. ఈనెల 9న రమేష్‌ వివాహానికి ముహుర్తాన్ని ఖరారైంది. ఇంతలోనే రమేష్‌ దారుణ హత్యకు గురికావడంపై కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రమేష్‌ మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.