యువకుల శ్రమదానం

చిలుకూరు : మండలంలోని సీతారామపురం గ్రామానికి చెందిన 20 మంది యువకులు సాగర్‌ నీటితో ఆ గ్రామంలోని చెరువునింపే కార్యక్రమాన్ని చేపట్టారు. శ్రమదానంలో భాగంగా ఎల్‌-3 కాల్వ నుంచి చెరువుకు నీటిని తరలించేందుకు కాల్వలకు అడ్డుగా పిచ్చి మొక్కలను, మట్టి దిబ్బలు, బండరాళ్లను తొలగించారు. ఈ కార్యక్రమంలో యువకులు ఉపేందర్‌, ప్రశాంత్‌ , నరేష్‌ వెంకటేశ్‌లతో పాటు గ్రామానికి చెందిన మరో 20 మంది యువకులు పాల్గొన్నారు.