యువత స్వయం శక్తితో అభివృద్ధి చెందాలి : కౌన్సిలర్ కక్కిరేణి శ్రీనివాస్

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వయంశక్తితో అభివృద్ధి చెందాలని స్థానిక 44 వ వార్డు కౌన్సిలర్ కక్కిరేణి శ్రీనివాస్ అన్నారు.బుధవారం జిల్లా కేంద్రంలోని నిర్మల హాస్పిటల్ రోడ్డులో హెల్తీ ఫిష్ స్పా సెంటర్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు.జిల్లా కేంద్రంలో ఇటువంటి మసాజ్ స్పా ని నెలకొల్పడం అభినందనీయమని అన్నారు.ఈ స్పాలో టర్కీ చేపలతో పాదాలను శుద్ధి చేపిస్తూ, పాదాలను ఆరోగ్యంగా ఉండేలా చేస్తున్నారని అన్నారు. బాడీ మసాజ్ చైర్ ద్వారా కస్టమర్లకు వత్తిడిని తగ్గించే పద్ధతులు పాటిస్తున్నారని చెప్పారు.వినియోగదారులకు  నాణ్యమైన సేవలను అందించి వారి మన్ననలు పొందాలన్నారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్తలు బండారు సత్యనారాయణ, పబ్బతి ప్రవీణ్ కుమార్,పబ్బతి పద్మ, షేక్ రఫీ, నిర్వాహకులు గుండు విక్రమ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.