*యోగ ద్వారా నే మానసిక ప్రశాంతాత *- *సివిల్ జడ్జి కవిత *

అలంపూర్ జూనియర్ సివిల్ కోర్టు నందు అంతర్జాతీయ యోగా దినోత్సవం ను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్జి కమలా పురం కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి రోజు యోగ చేయడంవల్ల మానసిక ప్రశాంతతోపాటు,ఆరోగ్యంగా ఉంటామని, యోగాను  ప్రతిరోజు చేసేందుకు అలవాటు చేసుకోవాలని న్యాయవాదులకు, పోలీస్ అధికారులకు, కోర్టు సిబ్బందికి  సూచించారు.  ఈ కార్యక్రమంలో సీఐ సూర్య నాయక్, ఎస్ఐ శ్రీహరి, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, రాజేశ్వరి, పివి.వెంకటేష్, ఎండి.ఆఫ్రోజ్, ఆంజనేయులు, షేక్ హుస్సేన్, జి. మధుసూదన్, కోర్ట్ సిబ్బంది పాల్గొన్నారు.