రంగసాయిపేట లో ఘనంగా పోచమ్మ బోనాలు

ఈస్ట్, ఆగస్టు 21(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని లోని అండర్ రైల్వే గేట్ పేటలో ఆదివారం పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా డప్పు చప్పుళ్ళ నడుమ మహిళలు బోనాలతో పోచమ్మ గుడి కి వచ్చి తమ మొక్కులు చెల్లించుకున్నారు. పిల్లాపాపలతో చల్లగా చూడాలని పోచమ్మ తల్లిని వేడుకున్నారు. శ్రావణ మాసం చివరి ఆదివారం కావడంతో  వందలాదిగా పోచమ్మ బోనాల తో రావడంతో రంగశాయిపేట పోచమ్మ దేవాలయం సందడిగా మారింది .ఆలయ నిర్వాహకులు భక్తులకు అన్ని విధాలుగా ఏర్పాటు చేశారు