రంగారెడ్డి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్‌

రంగారెడ్డి,: జిల్లాలోని మేడిపల్లిలో ఘరానా దొంగ వెంకటరెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 20 ఏళ్లుగా చోరీలకు పాల్పడుతున్న వెంకట్‌రెడ్డి నుంచి రూ.17 లక్షల విలువచేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.