రక్తదానం ప్రాణదానంతో సమానం

 రక్తదానం ప్రాణదానంతో సమానమని జిల్లా కేంద్రంలోని స్పందన డిగ్రీ కళాశాల డైరెక్టర్ టి. వేణు అన్నారు.శుక్రవారం ఆ కళాశాలలో హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ ఆధ్వర్యంలో రక్తదాన శిభిరం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో రక్తం అందక ఎంతో మంది మృతి చెందుతున్నారని అన్నారు.రక్తదానం వల్ల మరొకరికి ప్రాణదానం చేసినవారమవుతామని అన్నారు.విద్యార్థులు , ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు రక్తదానం చేశారు.ఈ కార్యక్రమంలో హెచ్ డీఎఫ్ సీ
బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ వేమిశెట్టి ప్రవీణ్ , ఆపరేషన్ మేనేజర్ హరీష్ , డిప్యూటీ మేనేజర్ తేజ , లోన్ మేళా సేల్స్ మేనేజర్ లింగయ్య , సిబ్బంది భాస్కర్ , నరేష్ , ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ బి.సునీల్ , ఎస్ కె. సలీమ్, అధ్యాపకులు , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.