రామప్ప ఆలయాన్ని సందర్శించిన టూరిజం డైరెక్టర్‌

ములుగు,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):  రామప్ప దేవాలయాన్ని భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ
టూరిజం డైరెక్టర్‌ జనరల్‌ జి. కమల వర్ధన్‌ రావు సోమవారం సందర్శించారు. రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చిన సందర్భంగా జిల్లా కలెక్టర్‌ కృష్ణ ఆదిత్యతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. యునెస్కో గుర్తింపు వచ్చిన సందర్భంగా పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ’రామప్ప ప్రసాద్‌’ పథకం రాష్ట్ర ప్రతిపాదితన స్థలాలను తనిఖీ చేసారు. అనంతరం రామప్ప శిల్ప కళా నైపుణ్యాన్ని గైడ్‌ విజయ్‌ను అడిగి తెలుసుకున్నారు. గుడిలోని రాతి కట్టడాలను, శిల్ప కళా నైపుణ్యాన్ని గైడ్‌ వివరించారు. పర్యాటక రంగ అభివృద్ధికి చేపట్టాల్సిన మౌలిక సదుపాయాల ఏర్పటను ఆయన పరిశీలించారు.