రామాలయ భూములను కాపాడుకుంటాం కమిటీ సభ్యులు

బిచ్కుంద జులై 18 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండల కేంద్రంలో ఉన్న రామాలయ భూములకు సంబంధించి 2 ఎకరాల 22 గుంటలు సుమారు రూ.100 కోట్ల రూపాయలు భూములకు సబంధించి ఎవరో అప్పనంగా మెక్కేశారు. దీంతో రామాలయ కమిటీ చైర్మన్, జిల్లా కమిటీ సభ్యులు స్పందించారు. ఈ మేరకు రామాలయ భూములకు సంబంధించిన హద్దులను గుర్తించి పూర్తి స్థాయిలో ఫెన్సింగ్ వేసేందుకు పనులను శరవేగంగా ప్రారంభించారు. ఆలయ కమిటీ చైర్మన్ హాజీ బాల్ రాజ్ మాట్లాడుతూ ఆలయ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోబోమని ఎంతటి పరిస్థితులను ఎదర్కొంటామని తెలిపారు.