*రామ లక్ష్మీపురం ప్రాథమిక పాఠశాలకి ప్రధాన గేటుబహుకరన*

మండలం లోని రా మలక్ష్మిపురం గ్రామంలో మండల ప్రాథమిక పాఠశాల లోచదివిన
 పూర్వ విద్యార్థి యన్నం కొండారెడ్డి వారి తాత కొప్పుల మల్లారెడ్డి జ్ఞాపకార్థంతో 35 వేల రూపాయల ఖర్చుతోపెద్ద గేట్ ఏర్పాటు చేయడం జరిగింది. సోమవారం నాడు పాఠశాల పున ప్రారంభం సందర్భంగా ప్రధాన గేటు ప్రారంభోత్సవ కార్యక్రమం మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా నిర్వహించారు.ఈ సందర్భంలో కొండా రెడ్డి  మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం ఇంగ్లీష్ మీడియం ప్రారంభించడం జరుగుతున్నది గ్రామంలోని తల్లిదండ్రులు పిల్లలను మన ఊరి బడిలో చేర్పించాలని కోరారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు అన్నాబత్తుల హనుమంతరావు ఉపాధ్యాయులు బడుగుల సైదులు కొండా రెడ్డిని ఘనంగా  శాలువాతో సన్మానించారు. ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పాముల మస్తాను ఎస్ఎంసి చైర్మన్ మేళ్లచెరువు లక్ష్మయ్య అంగన్వాడీ సిబ్బంది స్వరాజ్యం పార్వతమ్మ పాఠశాల సిబ్బంది లక్ష్మమ్మ లక్ష్మయ్య గ్రామ పెద్దలు లక్ష్మారెడ్డి రామిరెడ్డి అంజి రెడ్డి వెంకట్ రెడ్డి వెంకటేశ్వర్లు రామారావు పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు