రాయగిరిలో అతిసారంతో 10 మందికి అస్వస్థత

నల్లగొండ: నల్లగొండ జిల్లా భువనగిరి మండలం రాయగిరిలో అతిసారం ప్రబలింది. అతిసారంతో పదిమంది అస్వస్థతకు గురయ్యారు. వారు చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరారు. కలుషిత నీటితోనే వారు అస్వస్థతకు గురైనట్లు వైద్యులు తెలియజేశారు.  గ్రామంలోని ప్రయివేట్‌ మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ నీటిని సేవించటం వల్లే అస్వస్థతకు గురైనట్లు అనుమానాలు వ్యక్తం అవుతునన్నాయి. దాంతో అధికారులు వాటర్‌ ప్లాంట్‌ సీజ్‌ చేశారు.