రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు, నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని భారతీయ జనతా యువమోర్చ అధ్యక్షుడు బోడ అంజి యాదవ్

రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు, నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని కోరుతూ రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు భారతీయ జనతా యువమోర్చా కొండమల్లేపల్లి శాఖ ఆధ్వర్యంలో అధ్యక్షులు బోడ అంజి యాదవ్ అధ్యక్షతన  కొండమల్లేపల్లి మండల ఉప తాసిల్దార్ చంద్రశేఖర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువకులు, నిరుద్యోగులు పోరాడి, బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు ఉద్యోగ నియామకాలు జరపలేదని అన్నారు అనంతర. యువ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు భూతరాజు భరత్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగిందని కానీ వాటి అమల్లో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పేర్ల జితేందర్ ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు భూతరాజు లింగం గారు ఎస్టి మోర్చా మండల అధ్యక్షులు కొర్ర చందు నాయక్ గారు  యువమోర్చా మండల ప్రధాన కార్యదర్శి రమేష్ చంద్ర గారు బూత్ అధ్యక్షులు నాగా చారి గారు,కార్యకర్తలు పాల్గొన్నారు