రాష్ట్రంలో భాజపాదే అధికారం

 

ఇంటింటి ప్రచారంలో పాండురెడ్డి

మహబూబ్‌నగర్‌,నవంబర్‌23(జ‌నంసాక్షి): రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాండురెడ్డి అన్నారు. బిజెపి పట్ల ప్రజల్లో సానుకూల భావన

పెరిగిందని అన్నారు. ప్రజలు ప్రత్యామ్నాయా రాజకీయాలను చూస్తున్నారని అన్నారు. కోయలకొండ మండల కేంద్రంలో ఆయన శుక్రవారం ఇంటింటికి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో అభివృద్ధి చేసి తెరాస నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. ప్రాజెక్టుల పేరుతో దోచుకొని రైతులను నట్టేట ముంచారని విమర్శించారు. భాజపా అధికారంలోకి వస్తే ప్రాజెక్టులను తక్షణమే పూర్తిచేసి జిల్లాలో రూ. 7 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తామన్నారు. కమలం గుర్తుకు ఓటు వేసి భాజపాను గెలిపించాలని ఒటర్లను ఆయన అభ్యర్థించారు. కార్యక్రమంలో భాజపా నాయకులు శ్రీనివాస్‌, రాములు గౌడ్‌, శ్రీధర్‌, వేణు తదితరులు పాల్గొన్నారు.