రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ చందా గోపికి ఘన సన్మానం…

కేసముద్రం సెప్టెంబర్ 11 జనం సాక్షి / ఇటీవల తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం జాయింట్ సెక్రటరీగా నియమితులైన చందా గోపి ని మున్నూరు కాపు సంఘం కేసముద్రం మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఆదివారం మండల కేంద్రంలో మండల అధ్యక్షులు కమటం శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు మాట్లాడుతూ కేసముద్రం మండలం నుంచి రాష్ట్ర కమిటీ లో జాయింట్ సెక్రెటరీగా చంద గోపికి చోటు లభించడం హర్షనీయమన్నారు.గత కొద్ది సంవత్సరాల నుండి మున్నూరు కాపు సంక్షేమ సంఘ అధ్యక్షుడిగా,జిల్లా ప్రధాన కార్యదర్శిగా  మున్నూరు కాపుల అభివృద్ధికి ఐక్యతకు చేస్తున్న కృషికి ఆయనకు తగిన గుర్తింపు లభించిందని కొనియాడారు. ఇంకా భవిష్యత్తులో మరిన్ని పదవులు నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ నా మీద ఉన్న అభిమానంతో సన్మాన కార్యక్రమానికి వచ్చిన మండల నాయకులకు అన్ని గ్రామాల అధ్యక్ష కార్యదర్శులకు ముఖ్య నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.తదనంతరం మున్నూరు కాపు సంఘం పట్టణ అధ్యక్షులు, కేసముద్రం స్టేషన్ ఉపసర్పంచ్ ముత్యాల శివకుమార్ పుట్టినరోజు సందర్భంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా పుట్టిన రోజు వేడుకలను అందరి సమక్షంలో చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన సలహాదారు ప్రముఖ న్యాయవాది తుంపిల్ల శ్రీనివాస్, కేసముద్రం స్టేషన్ ఎంపీటీసీ ఆగే మంజుల వెంకన్న, ఇనుగుర్తి ఎంపీటీసీ రజిత శ్రీనివాస్, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ దామర కొండ ప్రవీణ్ కుమార్, గుంజ పొడుగు కొమ్మన్న ,ప్రధాన కార్యదర్శి కమటం స్వామి ,పిడిఎస్ఎస్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ బనిశెట్టి విజయ వెంకటేష్, తరాల సంపత్, రాష్ట్ర వార్డ్ మెంబర్ల ఫోరం అధ్యక్షుడు గుంజపుడుగు రాజశేఖర్, ఎస్ఎంసి చైర్మన్ దలువాయి శ్రీనివాస్, ఉపసర్పంచ్ ఆరుద్రపు శ్రీనివాస్, గుంజపొడుగు శ్రీనివాస్, సుందర్ వెంకన్న, నీలం సంపత్, మాసాడి శ్రీనివాస్, రేణికుంట్ల సుధాకర్, తరాల వెంకన్న, కమటం సుధీర్, తుంపిల్ల వెంకన్న ,తోట నాగయ్య ,లక్కాకుల వెంకటేశ్వర్లు, కమటం పెద్ద స్వామి, కట్కూరి శ్రీనివాస్, కమటం శ్రీధర్, కమటం శ్యామ్, ఉప్పునూతల రమేష్, సోమేశ్వర్ ,షేకిడి సతీష్ , పిచ్చయ్య, కమటం రామారావు ,గుండు దామోదర్, బండారు పెద్ద నరేష్ అన్ని గ్రామాల అధ్యక్ష కార్యదర్శులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.