రెండున్నర లక్షల రూపాయల ఎల్ఓసి అందజేసిన జిఎంఆర్ పటాన్చెరు నియోజకవర్గము

సంగారెడ్డి జిల్లా ఐడియా బొల్లారం మున్సిపాలిటీ పరిధి:- ఆపత్కాలంలో నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు! బొల్లారం మున్సిపల్ పరిధిలోని పాతబస్తీకి చెందిన రాములు భార్య లక్ష్మి
వైద్య చికిత్స కోసం సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రెండున్నర లక్షల రూపాయల ఎల్ఓసిని ఎమ్మెల్యే జిఎంఆర్ శనివారం పటాన్చెరు లోని తన కార్యాలయంలో లక్ష్మి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో భారతీయఎస్ పార్టీ సీనియర్ నాయకులు, బొల్లారం మున్సిపల్ కౌన్సిలర్ చంద్రారెడ్డి, పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు హనుమంత్ రెడ్డి, వరప్రసాద్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.