రేపు కుసుమ సముద్రం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం

– జన్ సాహస్ సంస్థ జిల్లా కో ఆర్డినేటర్ ప్రకాష్ కుమార్
కుల్కచర్ల, నవంబర్ 23 (జనం సాక్షి): జన్ సాహస్ స్వచ్ఛంధ సంస్థ ఆధ్వర్యంలో రేపు గురువారం మండల పరిధిలోని కుసుమ సముద్రం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు జన్ సాహస్ సంస్థ వికారాబాద్ జిల్లా కో ఆర్డినేటర్ ప్రకాష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కుసుమ సముద్రం గ్రామ పంచాయతీ ఆవరణలో ఉచితంగా ట్యాబ్లెట్లు,మందులు ఇవ్వడం జరుగుతుందన్నారు.ఈ అవకాశాన్ని కుసుమ సముద్రం గ్రామంతో పాటు చుట్టు పక్కల గ్రామాలు, తండాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.