రేపు జిల్లా వదిలి వెళ్లాలని షర్మిలను కోరిన పోలీసులు

నల్గొండ: జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ దృష్ట్యా రేపు వైకాపా నేత షర్మిల జిల్లా వదలి వెళ్లాలని పోలీసులు కోరారు. ‘మరో ప్రజా ప్రస్థానం’ పేరిట నల్గొండ జిల్లాలో షర్మిల పాదయాత్ర కొనసాగిస్తున్నారు. జిల్లాలో 21న ఎమ్మెల్సీ ఎన్నికలను నిర్వహిస్తున్నారు. 19 నుంచి ఎన్నికల కోడ్‌ అమలులోకి వస్తుంది. దీంతో ఇతర

ప్రాంత నేతలు ఉండకూడదని పోలీసులు ఆదేశించారు.