రైతాంగ సమస్యలపై తహసీల్దార్ కు వినతిపత్రం-కాంగ్రెస్

టీపీసీసీ అధ్యక్షుడి పిలుపు మేరకు గురువారం రోజున మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఆధ్వర్యంలో పలు డిమాండ్లుతో కూడిన వినతిపత్రాన్ని స్థానిక మండల తహశీల్దార్ పవన్ చంద్రకు ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల రుణమాఫీ పొడు భూములకు పట్టాలు ధరణి పోర్టును రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్నికి డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బోథ్ నియోజకవర్గ స్థాయి నాయకులు ఆడే గజేందర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఆడే వసంత్ రావు మండల ఓబీసీ ఎస్సి ఎస్టీ సెల్ చైర్మన్లు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఏలేటి రాజు.ప్రఫుల్ చంద్ రెడ్డి జాధవ్ వసంత్ రావు పలువురు యువ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.