రైతును కట్టిపడేసి మేకలు,  కోళ్లు దొంగతనం

నాగర్‌కర్నూల్‌,మే30(జ‌నం సాక్షి):  జిల్లాలోని బిజినపల్లి మండలం కారుకొండ గ్రామం సవిూపంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. వ్యవసాయ పొలం వద్ద నిద్రిస్తున్న రైతు ఖదీర్‌(65)ను తాళ్లతో కట్టేసి దాడి చేశారు. ఆ తర్వాత అక్కడున్న 17 గొర్రెలు, 40 నాటుకోళ్లను దొంగలు అపహరించారు. ఖదీర్‌కు తీవ్ర గాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలిని డీఎస్పీ లక్ష్మీనారాయణ, ఎస్‌ఐ ప్రదీప్‌లు పరిశీలించారు. డాగ్‌ స్కాడ్‌ బృందంతో తనిఖీలు చేపట్టారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.