రైతులను ఆదుకునేదెపుడో?
కరీంనగర్,నవంబర్18(జనంసాక్షి): బోధన, ఉపకారవేతన బకాయిల కోసం విద్యార్థులు పాట్లు పడుతున్నారని డిసిసి అధ్యక్షుడు మృత్యుంజయం అన్నారు. దళితబస్తీ కింద పట్టాలు ఇచ్చి భూములు చూపించడంలేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాసంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని ఆయన విమర్శించారు. ధనిక రాష్ట్రంతో పాటు మిగులు బడ్జెట్తో అధికారపగ్గాలు చేపట్టిన కేసీఆర్ పాలనలో అప్పుల చిట్టా పెరిగిందని వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని చెబుతున్నా…పట్టించుకోకుండా ,ప్రజాసంక్షేమాన్ని విస్మరిస్తూ విచ్చలవిడిగా నిధులు ఖర్చుచేస్తున్నారని పేర్కొన్నారు. రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నా వారిని పట్టించుకోవడంలేదన్నారు. ఎన్నికల హయాంలో ఇచ్చిన రూ.లక్ష రుణమాఫీని మూడేళ్లు పూర్తవుతున్నా చేయడంలేదని వాపోయారు. విలాసాలు, పండగలు, పబ్బాలకు ఉదారంగా నిధులు ఖర్చుచేస్తూ రాష్ట్ర ఆదాయానికి గండికొడుతున్న కేసీఆర్ ప్రజల సంక్షేమంపై, రైతుల ఆత్మహత్యలపై ఏనాడు చర్చించలేదనిపేర్కొన్నారు.



