రైలు సిగ్నల్స్ కట్ చేసి మరీ దారి దోపిడీ

మహబూబ్ నగర్ ‌: గుర్తు తెలియని దుండగులు యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో దారి దోపిడీకి పాల్పడ్డారు. దివిటిపల్లి రైల్వే స్టేషన్ వద్ద రైలు ఆగిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దుండగులు రైలు సిగ్నల్స్‌ను కట్ చేసి ప్రయాణికులను బెదిరించారు. ఐదుగురు ప్రయాణికుల వద్ద ఉన్న 25 తులాల నగలు, రూ.10 వేలు నగదును ఎత్తుకెళ్లారు. దీంతో బాధితులు కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. బెంగళూరు నుంచి కాచిగూడ వస్తుండగా ఈ ఘటన జరిగింది.