రొడ్డు ప్రమాదంలో ఫార్మసీ విద్యార్థి మృతి

కోదాడ : మలడలంలోని  తమ్మర వద్ద ఖమ్మంరోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఫార్మసీ చదువుతున్న విద్యార్థి మృతి చెందాడు. మరో విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి . కోదాడ అనురాగ్‌ ఫార్మసీ కళాశాలకు యెందిన 3న సంవత్సరం విద్యార్థులు ఎండీ నజీర్‌, వినోద్‌కుమార్‌లు  ద్విచక్రవాహనంపై వెళ్తు ఆటోను తప్పించబోయి లారీని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. నజీర్‌ అక్కడికక్కడే మరణించాడు. తీవ్రంగా గాయపడిన వినోద్‌కుమార్‌ కోదాడలో చికిత్స పొందుతున్నాడు,