రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

 మహబూబ్‌నగర్‌ : జిల్లాలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మాడుగుల మండలం అన్నెబోయినపల్లి గేట్ దగ్గర డీసీఎం వ్యాన్, ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు మృతిచెందారు. మరో పది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.