రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

వెల్దండ: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందిన ఘటన హైదరాబాద్‌ -శ్రీశైలం ప్రధాన రహదారిపై మహబూబ్‌నగర్‌ జిల్లా వెల్దండ పరిధిలోని కొట్రబస్టేజి సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అచ్చంపేటకు చెందిన ఆనంద్‌, అరుణ్‌, వెంకటమ్మ ద్విచక్రవాహనంపై హైదరాబాద్‌ వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న బొలేరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అరుణ(30) అక్కడికక్కడే మృతి చెందిగా ఆనంద్‌, వెంకటమ్మలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కల్వకుర్తి ఆసుపత్రికి తరలించారు.