రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

అచ్చంపేట: అచ్చంపేట బస్టాండు ఎదుట జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందాడు. బూత్పూరు మండలం కప్పెట గ్రామానికి చెందిన భీమ్‌చందర్‌ శివదీక్ష చేపట్టి మహాశివారాత్రి సందర్భంగా శ్రీశైలం వెళ్లి తిరిగి వస్తుండగా సోమవారం ఉదయం ప్రమాదం జరిగింది. ప్రధాన రహదారి పక్కన టీ తాగుతుండగా వెనకనుంచి వేగంగా వచ్చిన సుమో వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.