రోడ్డు ప్రమాదంలో 15 మందికి గాయాలు

నల్గొండ: నల్గొండ జిల్లా చర్లపల్లి వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు. లారీ-డీసీఎం-సుమో  ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు 108 సాయంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదాలు జరుగుతున్నా రహదారి విస్తరణ పనుల్లో జాప్యం చేస్తున్నారని చర్లపల్లి గ్రామస్థులు ఈ సందర్భంగా రాస్తారోకోకు దిగారు.