లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వాటర్ బాటిల్స్ కొవ్వొత్తులు పంపిణీ

పినపాక నియోజకవర్గం జూలై 16 (జనం సాక్షి): వారం రోజుల క్రితం కురిసిన వర్షాలకి మండలంలో గోదావరి ముంపుకు గురైన రాయి గూడెం గ్రామ వరద బాధితులకు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ దయానిధి వసంతాచార్యులు ఆధ్వర్యంలో భోజనం, వాటర్ బాటిల్స్, కొవ్వొత్తులుు, అగ్గిపెట్టలను సరఫరా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోదావరి ఉధృతి వల్ల రాయిగూడెం గ్రామంలో ఇళ్లల్లోకి నీరు చేరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇండ్లు, రోడ్లన్ని జలమయం కావడంతో విద్యుత్ సరఫరా లేక అవస్థలు పడుతున్నారు. వర్ష ప్రభావం వల్ల ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టి ఉన్నపలంగా పునరావాస కేంద్రాలకు వెళ్లారు. విలువైన వస్తువులను జాగ్రత్త పరుచుకోవడానికి విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో వారికి కొవ్వొత్తులు అగ్గి పెట్టల్ను అందించాము. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాము. ఆపదలో ఉన్నామంటే అక్కున చేర్చుకోవడానికి మేమున్నామంటూ భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు దయానిధి వసంతాచార్యులు, రీజియన్ చైర్పర్సన్ గంటా రమేష్ బాబు, జోన్ చైర్ పర్సన్ దుస్థా సమ్మయ్య ,ట్రెజరర్ తాతారావు మణుగూరు పట్టణ సీఐ ముత్యం రమేష్, పోలీస్ సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.