లాభాల లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్

  • 89 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 36 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 2 శాతానికి పైగా పెరిగిన నెస్లే ఇండియా షేరు విలువ

దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాల జోరు కొనసాగుతోంది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 89 పాయింట్ల లాభంతో 74,006 వద్ద ముగిసింది. నిఫ్టీ 36 పాయింట్లు పెరిగి 22,502కి చేరుకుంది. ఈరోజు  అన్ని సూచీలు లాభాల్లోనే ముగిశాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
నెస్లే ఇండియా (2.33%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.12%), టాటా మోటార్స్ (0.76%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (0.43%), టీసీఎస్ (0.42%).

టాప్ లూజర్స్:
జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-1.80%), మహీంద్రా అండ్ మహీంద్రా (-0.40%), మారుతి (-0.32%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.30%), రిలయన్స్ (-0.06%).