లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు… నలుగురి మృతి

నకిరేకల్‌ : పట్టణ శివారులో హైదరాబాద్‌ `విజయవాడ జాతీయ రహదారిపై ఈ తెల్లవారుజామున అర్టీసీ బస్సు ఆగి లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. 9 మంది గాయపడ్డారు. అర్టీసీ బస్సు హైదరాబాద్‌ నుంచి భద్రాచలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను నకిరేకల్‌ ఆసుపత్రికి తరలించారు.