లారీని ఢీకొన్న ట్రాన్స్‌కో వాహనం, ముగ్గురి మృతి

సూర్యపేట : నల్గొండ జిల్లా సూర్యాపేట మండలం రాయినిగూడెం వద్ద ఈ రోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. ట్రాన్స్‌ఫార్మర్లు తరలిస్తున్న ఏపీ ట్రాన్స్‌కోకు చెందిన వాహనం రోడ్డు పక్కన నిలిపివున్న లారీని ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.