లింగాల హిందూ దేవాలయా విగ్రహాలపై ఆగని దాడులు నాడు శివాలయం నేడు పోచమ్మ విగ్రహాన్ని ద్వంసం చేసిన దుండగులు

 

జనం సాక్షి ప్రతినిధి : లింగాల మండల కేంద్రం సమీప శివారులో గ్రామ దేవత పోచమ్మ గుడిలోని పోచమ్మ దేవత విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని దుండగులు మంగళవారం రాత్రి ధ్వంసం చేశారు.దుండగులు గుడిలోకి ప్రవేశించి విగ్రహాన్ని పెకిలించి క్రింద పడేయడంతో విగ్రహం పాక్షికంగా ధ్వంసం అవ్వడంతో చుట్టు పక్కల పంట పొలాల్లో ఉన్న రైతులు గమనించి స్థానిక సర్పంచ్ కోనేటి తిరుపతయ్య కు, ఎస్ఐ రవి కి సమాచారం అందించారు.సమాచారం తెలుసుకున్న ఎస్ఐ రవి,సర్పంచ్ తిరుపతయ్య సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. విగ్రహ ధ్వంసం పై సమీప పంట పొలాల్లో ఉన్న రైతులను అడిగి తెలుసుకున్నారు.గత రెండు నెలల క్రితం శివాలయంలో ఉన్న నంది విగ్రహం ధ్వంసం కావడం అది మరువక ముందే ఈ ఘటన జరగడం పట్ల గ్రామ ప్రజలు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు.పోలీస్ వారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా దుండగులను గుర్తించి శిక్షించాలని గ్రామ ప్రజలు కోరారు.ఆలయ సమీప రైతుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవి తెలిపారు.