లేడీపోస్ట్‌మాస్టర్‌పై కాల్పులు..నగదు తస్కరణ

మహబూబ్‌నగర్‌,మార్చి26 (జ‌నంసాక్షి) : మహబూబ్‌నగర్‌ జిల్లాలో గురువారం కాల్పులు కలకలం చెలరేగింది. ఆసరా పింఛన్లు పంపిణీ చేసేందుకు వెళుతున్న  బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్‌ శిరీషను ఓ దుండగుడు రివాల్వర్‌తో  బెదిరించాడు. అనంతరం గాల్లో రెండు రౌండ్లు జరిగి… ఆమె వద్ద నుంచి లక్షా 50వేలు తీసుకుని పరారయ్యాడు. ఈ సంఘటన వనపర్తి మండలం ఖాసింనగర్‌లో  చేటుచేసుకుంది.గోపాలపట్నం మండలం జైళ్ల తిరుమలాపురానికి చెందిన బీపీఎం శిరీష మరో యువకుడితో కలసి బైక్‌పై వెళుతుండగా వనపర్తి మండలం కాశీనగర్‌ దగ్గర ఓ వ్యక్తి రివాల్వర్‌తో బెదిరించి 1.50లక్షల నగదు దోచుకుని పరారయ్యాడు.  పోస్ట్‌మాస్టర్‌ను తుపాకులతో బెదిరించి  కాజేసిన డబ్బు పెన్షన్లదని తెలుస్తోంది.  తన వద్ద ఉన్న బ్యాగ్‌ ఇచ్చేందుకు పోస్ట్‌మాస్టర్‌ హర్షిత నిరాకరించడంతో దుండగులు రెండు రౌండ్ల కాల్పులు జరపడంతో హర్షిత స్పృహతప్పి పడిపోయారు. ఉపాధి హావిూ కూలీలకు డబ్బులు ఇచ్చేందుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఘటనాస్థలంలో మూడు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.