వంటగ్యాస్ ధర…పేదల గుండెల్లో మంట

వంటగ్యాస్ ధర…పేదల గుండెల్లో మంట

పేదలకు దినదిన గండంగా మోడీ ప్రభుత్వం:కొత్తగూడ టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొమ్మనబోయిన వేణు

కొత్తగూడ జులై 8 జనంసాక్షి:మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో పెంచిన వంట గ్యాస్,పెట్రోల్,డీజిల్ ధరలు,నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటాయని వెంటనే తగ్గించాలని,కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా మండల తెరాస పార్టీ అధ్యక్షుడు వేణు ఆధ్వర్యంలో నిరసన తెలుపుతూ ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా వేణు యాదవ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మానవత్వం లేని మోడీ ప్రభుత్వమని,నేడు కేంద్ర ప్రభుత్వం పేదవారికి దిన దిన గండంగా మారిందని అన్నారు.వంట గ్యాస్ ధరను రూ.50 కు పెంచిందని విమర్శించారు.మోడీ అధికారంలోకి రాకముందు రూ.400 ఉన్న వంట గ్యాస్ ఇప్పుడు రూ.1105 చేరుకుందని ఆగ్రహం వ్యక్తం చేసారు.ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్,పెట్రోల్,డీజిల్ ధరలను తగ్గించాలని లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు.ఈకార్యక్రమంలో తెరాస అధికార ప్రతినిధి నెహ్రు నాయక్,ఉద్యోగుల సంగం రాష్ట్ర నాయకులు ఈసం స్వామి సార్,గుంజేడు సర్పంచ్ అజ్మీర రజిత రమేష్ నాయక్,ఎంపీటీసీ మోకాళ్ల సంతోషారాణి వెంకటేష్,జున్ను అశోక్,పశుల గట్టయ్య, సునారి మోహన్ రావు,పూల యాదగిరి, అజ్మీర రాజన్న నాయక్,జిమ్మిడీ సంతోష్,నాయకులు,యువజన విభాగం నాయకులు,మహిళలు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు