వజ్రోత్సవాల్లో భాగంగా మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు

రుద్రంగి ఆగస్టు 21 (జనం సాక్షి)
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 75 వ స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం హరితహారంలో భాగంగా మెగా ప్లాంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపిపి గంగం స్వరూప మహేష్,జడ్పిటీసీ గట్ల మీనయ్య,సర్పంచ్ తర్రె ప్రభాలత మనోహర్,పాల్గొని అధికారులతో కలిసి మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ…ప్రతి ఒక్కరు దేశ భక్తిని చాటే విదంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నిర్వహించడం చాలా గర్వకరణమని అన్నారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కి దాన్యవధాలు తెలిపారు.ప్రతి ఒక్కరు హరితహారంలో పాల్గొని మొక్కలు నాటి పర్యావరణాన్ని పెంచాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ శంకర్,వైస్ ఎంపిపి పిసరి భూమయ్య,తెరాస అధ్యక్షుడు దెగవత్ తిరుపతి, నాయకులు మంచే రాజేశం,దయ్యాల నారాయణ,
బాధనవేణి రాజారాం,చెప్యాల గణేష్,గెంటే ప్రశాంత్,తదితరులు పాల్గొన్నారు.