వరంగల్లో 20 కొత్త బస్సులు ప్రారంభం
వరంగల్: బీసీ సంక్షేమ శాఖమంత్రి బస్వరాజు సారయ్య ఈ రోజు వరంగల్ బస్స్టేషన్లో 20 కొత్త బస్సులను ప్రారంభించారు. నానాటికి పెరుగుతున్న ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని బస్సుల సంఖ్య పెంచుతున్నట్లు మంత్రి తెలియజేశారుజ వరంగల్ నుంచి తిరుపతి, షిరిడీలకు నేరుగా ప్రత్యేక బస్సులు నడిపేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులు తెలియజేశారు.