వరద బాధితులకు భోజన వసతిని, లారీ ట్యాంకర్ల ద్వారా త్రాగునీటిని అందించిన జడ్పిటిసి శ్రీలత.

బూర్గంపహాడ్ జూలై 17 (జనంసాక్షి)భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో స్థానిక జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత గోదావరి వరద బాధితులకు భోజన వసతిని, మంచినీటి లారీ ట్యాంకర్లు ద్వారా త్రాగునీటిని ఏర్పాటుచేసి దాహార్తిని తీర్చారు. ముంపు వాసులు కట్టా జగదీష్ బిల్డింగ్, భారతి భవన్ నందు పునరావాసం పొందుతున్న 6 వందల నుంచి 1000 మందికి మంచినీరుని, భోజన వసతుల్ని కల్పించి వారికి అన్ని విధాల తోడుంటామని భరోసా కల్పించారు. వారికి కావలసిన సదుపాయాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నైతిక ధైర్యం ఇస్తున్న జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత, రామ కొండారెడ్డి దంపతులకు స్థానిక వరద బాధితులు ధన్యవాదములు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వారి వెంట స్థానిక టిఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ గోనెల నాని, సొసైటీ డైరెక్టర్ బొల్లు రవి, మల్లారెడ్డి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.