వరద ముంపు గ్రామాల్లో అధికారుల పర్యటన

జూలై12 జనం సాక్షి:
ములుగు జిల్లా రెవెన్యూ డివిజనల్ అధికారి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారులు వాజేడు మండలం లోని పర్యటించారు, గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ముంపునకు గురైన వంతెనలు, రహదారులను పరిశీలించారు,
మండల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు,మండలం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ములుగు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు, పేషంట్ల ఆరోగ్య సమస్యలు పరిస్థితులు తెలుసుకొని వరదల కారణంగా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు,

2 Attachments