వలిగొండలో ఉచిత వైద్య శిబిరం

వలిగొండ జనం సాక్షి సెప్టెంబర్ న్యూస్ 25 : మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం బిజెపి నాయకులు సి ఎన్ రెడ్డి(చిట్టెడి నర్సింహారెడ్డి)సౌజన్యంతో హైదరాబాద్ లోని శాలివాహన ఆసుపత్రి ఆధ్వర్యంలో సుమారుగా 150 మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం డాక్టర్లను శాలువాతో సన్మానించి మెమెంటును అందజేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు పివి శ్యామ్ సుందర్ రావు,జిల్లా ఇంచార్జి నందకుమార్ యాదవ్,మండల అధ్యక్షుడు నాగేల్లి సుధాకర్ గౌడ్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతంశెట్టి రవీందర్,పార్లమెంట్ కన్వీనర్ బందారపు లింగస్వామి,జిల్లా ఉపాధ్యక్షుడు చందా మహేందర్ గుప్తా,జిల్లా ప్రధాన కార్యదర్శి నకిరేకంటి మొగులయ్య,స్థానిక ఉపసర్పంచ్ మైసోళ్ల మత్స్యగిరి,ఓబిసి మోర్చా జిల్లా అధ్యక్షుడు దుర్గపతి లక్ష్మీనారాయణ,జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు రాజశేఖర్,నాయకులు ఏలే చంద్ర శేఖర్,చిట్టెడి అభితేజ్ రెడ్డి(నాని),బత్తుల జంగయ్య గౌడ్,పిట్టల అశోక్,కనతాల అశోక్ రెడ్డి,మండల ప్రధాన కార్యదర్శి మారోజు అనిల్ కుమార్,మండల ఉపాధ్యక్షుడు బొడిగె ఆనంద్ గౌడ్,పల్లపు దుర్గయ్య,రెగూరి అమరెందర్,శ్రీనివాస్,డోగిపర్తి సంతోష్,గండికోట హరీష్,మైసోళ్ల మత్స్యగిరి,హరీష్,అరుణ్,నవీన్ తదితరులు పాల్గొన్నారు.