వార్డుల్లో ఎమ్మెల్యే పాదయాత్ర

నకిరేకల్‌: నకిరేకల్‌ మున్సిపాలిటీ పరిధిలో సమస్యను తెలుసుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వార్డుల్లో పాదయాత్ర నిర్వహించారు. తాగునీరు, పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. సీసీ రహదారులు నిర్మిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు మారం చెన్నకృష్ణారెడ్డి, కేవీఎన్‌రెడ్డి బ్రహ్మదేవర రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.