వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి;

కోదాడ రూరల్ ఎస్సై సాయి ప్రశాంత్
కోదాడ టౌన్ నవంబర్ 17 ( జనంసాక్షి )
వాహనదారులు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోదాడ రూరల్ ఎస్సై సాయి ప్రశాంత్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, ఆర్ సి, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలన్నారు.నెంబర్ ప్లేట్ లేని వాహనాలు నడపడం చట్ట రిత్య నేరం అన్నారు. రాంగ్ రూట్,ర్యాష్ డ్రైవింగ్,త్రిబుల్ డ్రైవింగ్ తోపాటు మైనర్లకు వాహనాలు ఇచ్చినచో యజమానులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. పరిమితికి మించి ప్రయాణికులను ఆటోలో ఎక్కించరాదన్నారు.ఆటోలు ట్రాక్టర్లు,ట్రాలీలలో లౌడ్ స్పీకర్లు పెట్టినచో అట్టి వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుంది కావున వాహనదారులు అందరు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీస్ వారికి సహకరించాలని తెలియజేశారు.