విఆర్ఏలకు సంఘీభావం తెలిపిన బలరాం జాదవ్.

నేరడిగొండఆగస్టు10(జనంసాక్షి):మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట17 రోజులుగా చేస్తున్న నిరవధిక దీక్షకు తెలంగాణ రాష్ట్ర అద్యాపక సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ బుధవారం నాడు సంఘీభావం తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా విఆర్ఏలు తమ న్యాయమైన డిమాండ్లతో సమ్మె చేస్తున్నారని అన్నారు.బేసిక్ పే క్వాలిఫికేషన్ ఆధారంగా ప్రమోషన్లు చిన్న చిన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బలరాం జాదవ్ డిమాండ్ చేశారు.అసెంబ్లీ సాక్షిగా విఆర్ఎలను రెగ్యులరైజ్ చేస్తానని ముఖ్యమంత్రి  ప్రకటించి ఇప్పటి వరకు ఊసెత్తడం లేదని అన్నారు.ఇట్టి విషయంలో పట్టించుకోకపోవడం సమంజసం కాదని విఆర్ఏలకు న్యాయం చేయకపోతే 23 వేల కుటుంబాలు రోడ్డున పడతాయని అన్నారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యలు వెంటనే పరిష్కరించాలని అధ్యాపక సంఘం తరపున డిమాండ్ చేశారు.