విఎన్ ఆశయాలను సాధించాలి

 వర్ధంతిలో డబ్బికార్ మల్లేష్
మిర్యాలగూడ, జనం సాక్షి.
మల్లు వెంకట్ నరసింహ రెడ్డి ఆశలను సాధించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికారి మల్లేష్ కోరారు.  విఎన్ 18వ వర్ధంతి సందర్భంగా సోమవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో విఎన్ చత్రపటానికి పూలమాలసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీ నిర్మాణ కోసం ఆయన చేసిన కృషి మరువలేనన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పేదల పక్షాన పోరాడారని కొనియాడారు. ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు సాగించారని చెప్పారు. ఆయన చూపిన మార్గాన్ని కార్యకర్తలు ఎంచుకొని పార్టీ బలోపేతంకు పాటుపడాలని కోరారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో  సిపిఎం  జిల్లా నాయకులు డా. మల్లు గౌతమ్ రెడ్డి, పాదురి శశిధర్ రెడ్డి, రేమిడల పరశురాములు,గుణగంటి రామచంద్రు, గోలి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.