వికారాబాద్ బయలుదేరిన మర్పల్లి నాయి బ్రాహ్మణులు.

జిల్లా కేంద్రంలో నాయి బ్రాహ్మణులు కార్పొరేట్ సెల్యూన్లకు వ్యతిరేకంగా చేస్తున్న రిలే నిరాహార దీక్షకు ఆదివారం రోజున మర్పల్లి నాయి బ్రాహ్మణులు వికారాబాద్ బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మేము మా కులవృత్తిని నమ్ముకుని పనిచేస్తున్నామని, మా వృత్తిని కార్పొరేట్ సంస్థ కు అప్పగించి మా కుటుంబాలను రోడ్డుపాలు చేయరాదని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయి బ్రాహ్మణ అధ్యక్షుడు రాజు,  మర్పల్లి గ్రామ కమిటీ నాయి బ్రాహ్మణ అధ్యక్షుడు నారాయణ, వెంకట్, గోపాల్, రమేష్, విట్టల్ ఉన్నారు.