విజయవాడ-హైదరాబాద్‌ హైవేపై దారుణం

1నల్గొండ జిల్లాలో ఘోరం జరిగింది. ఏపీ 09 బీవై 2725 నంబర్ మారుతి సుజుకీ రిట్జ్ కారు కట్టంగూర్ దగ్గర రోడ్డుపై నడిచి వెళ్తున్న వృద్ధుడిని ఢీకొట్టింది. దీంతో, వృద్ధుడు ఎగిరి కారుపై పడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహం కారుపై ఉన్నా డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయాడు. స్థానికులు వెంటపడి 10-12 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత ఐటిపాముల దగ్గర కారుని అడ్డగించారు. డ్రైవరుని కొట్టి పోలీసులకు అప్పగించారు. కారుని ధ్వంసం చేశారు. కారు ఢీకొట్టిన వెంటనే వృద్ధుడు చనిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. మృతుడు ఎడవెల్లి గ్రామానికి చెందిన కొమరెల్లి వెంకటరెడ్డిగా గుర్తించారు. పొలం దగ్గరికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.