విద్యార్థిని బలవన్మరణం

5న ల్లగొండ

గణతంత్ర వేడుకలతో యావత్భారతావని ఉంటే తెలంగాణలో మాత్రం ఓ కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. షేమ్ ఇండియా అంటూ సిగ్గుతో తలదించుకునేలా చేసింది. నల్లగొండ జిల్లా గుండాలలో… ఇంట్లో మరుగుదొడ్డి కట్టలేదని ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతున్న కొడపర్తి రేఖ అగ్నికి ఆహుతై సజీవదహనమైంది.న ల్లగొండలో ఓ విద్యార్థి తనువు చాలించింది. ఆరు బయట ఆకతాయిల వేధింపులతో… ఆడ కూతురు బలైపోయింది. తల్లిదండ్రుల అవగాహన లోపం, అధికారుల అసమర్థత… రిపబ్లిక్ డే రోజు పెనువిషాదం నింపింది. తెలంగాణలో మొండిగోడలతోనే మరుగుదొడ్లు దర్శనమిస్తున్నాయి. సర్కారీ పథకాలు సామాన్యుడి దరి చేరడం లేదు.