విద్యార్థులకు తప్పిన ప్రమాదం.

కులుతున్న డైనింగ్ హాల్.

జనం సాక్షి ఉట్నూర్.

గురువారం నార్నూర్ మండల కేంద్రంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో మొత్తం 227 మంది విద్యార్థులు ఉన్నారు. మధ్యాహ్నం సమయంలో వంటగది డైనింగ్ హాల్ స్లాబ్ యొక్క కింది భాగము ఒకటేసారి కూలిపోవడం జరిగింది.ఘటన జరిగిన సమయంలో విద్యార్థులు క్లాస్ రూమ్ లో ఉండడంతో ప్రమాదం తప్పిందని అదృష్టంగా భావించారు.అధికారులు విషయాన్ని గమనించి భవనం యొక్క మరమ్మతులు అతి త్వరలో నిర్వహించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాదవ్ మధుకర్ అన్నారు.