విద్యార్థులకు నోటు పుస్తకాలు అందజేయాలి

ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు వేంటనే అందజేయాలని బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పలగూర్ల రాందేవ్ బాబా అన్నారు. వలిగొండ మండల కేంద్రంలో ప్రగతి కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల తెరిచి 20 రోజులు గడుస్తున్నా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ప్రభుత్వం అందజేయ కపోవడం హేమమైన చర్య అని అన్నారు.ప్రభుత్వ,ప్రవేటు కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు స్కాలర్ షిప్ లను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాని డిమాండ్ చేశారు.లేని పక్షంలో విద్యార్థులంతా కలిసి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం కలెక్టరేట్ను ఆర్టీసీను ముట్టడిస్తామని రాందేవ్ బాబా హెచ్చరించారు.