విద్యార్థులకు పరిశుభ్రత వ్యాధుల పట్ల అవగాహన– బీసీ హాస్టల్ లో వైద్య శిబిరం

టేకులపల్లి,నవంబర్ 11( జనం సాక్షి): టేకులపల్లి మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే బీసీ బాలుర హాస్టల్ లో వైద్యాధికారి డాక్టర్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో శుక్రవారం వైద్య శిబిరం నిర్వహించి 27 మంది విద్యార్థులకు చిరు వ్యాధులకు వైద్య పరీక్షలు చేసి చికిత్సఅందించారు. విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత,పోషకాహారం, ముఖ్యంగా చర్మ సంబంధిత అంటూ వ్యాధులపై, వయసుతోపాటు హార్మోన్ల ప్రభావం చేత శరీరంలో, మానసిక ఆలోచనావిధం లో వచ్చే వివిధ మార్పులపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా టీనేజ్ వయసులో క్రమశిక్షణతో ఉండి చదువుపట్ల,క్రీడల పట్ల దృష్టి సారించడం వలన జీవితంలో చక్కగా రాణించవచ్చునని వైద్యాధికారి విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే బిసి బాలుర పాఠశాల ప్రిన్సిపాల్ చైతన్య, హాస్టల్ వార్డెన్ మాధురి, స్టాఫ్ నర్స్ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు