విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించాలి : కలెక్టర్‌

నల్గొండ, ఫిబ్రవరి 2 (): జిల్లాలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పోటీ పరీక్షల ఉచిత శిక్షణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ ఎ.తేజ్‌ భరత్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిగ్రీ పూర్తి కాకుండానే చదువు ఆపి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారని, అలా కాకుండా ఉన్నత విద్యనభ్యసించి ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టాలని ఆయన విద్యార్థులకు సూచించారు. కళాశాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనార్జీ విద్యార్థుల ప్రయోజనార్ధం ప్రభుత్వం పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇచ్చే కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ అలివేలు మంగమ్మ, అధ్యాపకులు శంకరాచారి, ప్రకాశ్‌, రాజకుమారి, పిచ్చిరెడ్డి, మున్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.