విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నతస్థాయికి చేరుకోవాలి.

ఎమ్మెల్యే జోగురామన్న…
బేల, నవంబర్ 30 ( జనం సాక్షి ) మండల కేంద్రము లోని కీర్తన డిగ్రీ కళాశాల అద్వర్యములో బుధవారం  ఫంక్షన్ హాల్ నిర్వహించిన ఫ్రెషర్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జోగురామన్న హాజరయ్యారు. ఈసందర్భంగా  ఎమ్మెల్యే  మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ తో చదివి ఉన్నతస్థాయికి చేరుకోవాలని కోరారు. విద్యార్థులు బాగా చదివి కాలేజీ కి తల్లి తండ్రుల కు మంచి పేరు తిసుకరావలని  సుచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ గోడం నగేష్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రావుత్ మనోహర్, సర్పంచ్ ఇంద్ర శేఖర్, నాయకులు గంభీర్ ఠాక్రే, సతీష్ పవార్, ప్రమోద్ రెడ్డి, మండల కో ఆప్షన్ మేంబర్ తన్విర్ ఖాన్, కళాశాల చైర్మన్ పవన్ కుమార్ అగర్వాల్, ప్రిన్సిపాల్ వరప్రసాద్ రావ్ కళాశాల అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు…